Kishan Reddy: నిశబ్ద విప్లవం రానుంది.. బీజేపీకి యూత్ మద్దతు ఇస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: నిశబ్ద విప్లవం రానుందని.. యూత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. యూత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, నిశబ్ద విప్లవం రానుందని అన్నారు. బీఆర్ఎస్ పైన ప్రజలు తిరగ బడుతున్నారని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవెరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ నష్టపోయింది… ప్రజల రక్తం తాగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ లు, ఫేక్, ఆచరణ సాధ్యం కానివని, ఓట్ల కోసం మాత్రమే ఇచ్చినవే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది చెప్పైన అధికారం లోకి రావలనేది వారి ఆలోచన అన్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా మా ఎన్నికల మేనిఫెస్టో ఉందన్నారు. అవినీతినీ ఉక్కుపాదంతో అణచి వేస్తామని అన్నారు.
చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ప్రజలు నిశ్శబ్ద విప్లవంగా చూస్తున్నారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు, ప్రచార రథాలు రాకుండా ప్రజలు అడ్డుకునే పరిస్థితి నెలకొంది. దళిత సోదరులు, రుణమాఫీ, బీసీ సోదరులు, దళిత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదని ధీటుగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసులంటే భయపడిన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందన్న నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు ఫేక్ లీకులు ఇస్తున్నా.. బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
బీజేపీ మేనిఫెస్టోకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ తనను ఆకర్షించింది. యువత నరేంద్ర మోదీకి అండగా నిలుస్తోంది. భార్సా, కాంగ్రెస్ కుటుంబాలకు చెందిన వారు కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. చెప్పినదానికి కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ అని అందరూ అనుకుంటున్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోట దాటినా, చేసేది ప్రగతి భవన్, గాంధీభవన్ దాటి వెళ్లడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ పార్టీ ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు విషాదాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడిందన్నారు. ఉద్యమంలో మొదటి దశలో 365 మంది, మూడో దశలో 1200 మంది విద్యార్థులు చనిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ ఇస్తున్న బూటకపు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కిషన్ రెడ్డి అన్నారు.
CM KCR: మానకొండూర్ సభకు కేసీఆర్.. సీఎం బస్సును చెక్ చేసిన అధికారులు
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!