CM Revanth Reddy: నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ ల్లో సీఎం రేవంత్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభకు సీఎం హాజరుకానున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఉప్పల్ లో సాయంత్రం రేవంత్ రెడ్డి రోడ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు గమనించాలని సూచించారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బంది పడకుండా.. వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సహకరించాలని కోరారు.
Read also: prasannavadanam Twitter Review : సుహాస్ ‘ప్రసన్న వదనం ‘ హిట్టా? ఫట్టా?
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఇక ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని చెప్పి కేంద్రం తెలంగాణకు గాడిదను ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడినందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవని రేవంత్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల కుల గణన చేస్తున్నాం. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతాం. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ అన్నారు. 1881 నుండి, దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తున్నారు. 2021లో జనాభా గణన జరగాల్సి ఉన్నా.. అమిత్ షా కుట్ర చేసి అడ్డుకున్నారు. బంజరు భూముల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మోడీ, కేసీఆర్లు పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు చేసిందేమీ లేదని రేవంత్ మండిపడ్డారు.
prasannavadanam Twitter Review : సుహాస్ ‘ప్రసన్న వదనం ‘ హిట్టా? ఫట్టా?
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!