CM Revanth Reddy : సర్పంచ్లకు సీఎం రేవంత్ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్..!
- ఎన్నికలు ముగిశాయి.. ఇక రాజకీయాలు లేవు
- పార్టీలు, పంతాలకు పోకుండా.. వివక్ష చూపకుండా అందర్నీ కలుపుకుని పోవాలి
- పక్క పార్టీ నుంచి గెలిచిండని వివక్ష చూపకండి
- అలా చేస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుంది - సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సర్పంచ్లకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు (Special Development Fund) అందుతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, ప్రతి పెద్ద గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాధారణంగా వచ్చే నిధులకు ఇది అదనమని, దీనివల్ల గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. లిస్ట్-Aలో 16,000 పరుగుల మైలురాయి..!
Also Read
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
- Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
ఈ సందర్భంగా సర్పంచ్లకు దిశానిర్దేశం చేసిన సీఎం, ఎన్నికల సమయం ముగిసినందున ఇకపై గ్రామాల్లో రాజకీయ పంతాలకు, పార్టీల వివక్షకు తావు ఉండకూడదని హితబోధ చేశారు. ఎదుటి పార్టీ నుంచి గెలిచిన వారైనా సరే, అందరినీ కలుపుకుని పోతేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, వివక్ష చూపితే అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరి పేర్లను నమోదు చేయాలని, వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందరికీ వర్తించేలా, అర్హులు ఉండి కూడా లబ్ధి పొందని వారి జాబితాను సిద్ధం చేయాలని సర్పంచ్లను ఆదేశించారు. ప్రజా రవాణాలో మహిళల సౌకర్యం గురించి మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళల హక్కు అని, ఎవరైనా కండక్టర్లు టికెట్ డబ్బులు అడిగితే “మా అన్నకు (సీఎం) కు చెప్తాం, నీ ఉద్యోగం తీసేయిస్తాం” అని ధైర్యంగా చెప్పాలంటూ మహిళలకు అండగా నిలిచారు. పారదర్శకమైన పాలనతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సర్పంచ్లకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!