CM Revanth Reddy: ప్రజాపాలన అప్లికేషన్ల అమ్మకాలు.. సీఎం సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండు రోజులుగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పూర్తి కాగా.. మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. డబ్బులు పెట్టి దరఖాస్తులు కొనవద్దని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ఒకవేశ డబ్బులకు ప్రజా పాలన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేవని.. దీంతో జిరాక్స్ సెంటర్లలో డబ్బులు కొంటున్నారనే వార్తలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైనన్ని దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
Read also: Hi Nanna : ఓటీటీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన నెట్ ఫ్లిక్స్..
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. భీమా, పింఛన్ల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని సూచించారు. పాత లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి యథావిధిగా సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజాపరిపాలన దరఖాస్తుల ప్రక్రియ, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ప్రజాపరిపాలన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన గ్రామసభల వివరాలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపరిపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాపాలన శిబిరాల్లో దరఖాస్తుదారులకు వచ్చేవారికి అక్కడ తాగునీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.
KBC 15 : కేబీసీ 15ముగింపు.. ఏడుస్తూ వీడ్కోలు పలికిన అమితాబ్ బచ్చన్
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!