Get to Gather: ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Get to Gather: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారని అన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబ్ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్ నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం అన్నారు.
Read also: Saranya Pradeep: అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?
Also Read
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
గత పదేండ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు. యువతీ, యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలన్నారు. రోజురోజుకు సైబర్ క్రైమ్స్ అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టెందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
Grama Panchayathi: నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన.. ప్రభుత్వం జీవో జారీ
తాజావార్తలు
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
Suriya 48 : ఎగ్మోర్లో జెట్ స్పీడ్లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!