CM KCR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన.. సత్తుపల్లి, ఇల్లందులో సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంతో ముందుకు సాగుతుంది. ఒకవైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. అధినేత మాత్రం రోజుకు రెండు, మూడు బహిరంగ సభలకు హాజరవుతూ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నారు. నేడు ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కల్లూరుకు చేరుకుంటారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సట్టచతెలన సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేశారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల ప్రచార సభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కేసీఆర్ ప్రకటిస్తారనే హామీల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తుపల్లి బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ సభకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ వావిరాజు రవిచంద్ర విస్తృత ఏర్పాట్లు చేశారు.
Also Read
- Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
- Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమళ్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 20 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా.. ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగ సభలకు పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కల్లూరు సభా ప్రాంగణాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.
Israeli President: హమాస్పై దాడులు ఆపే ప్రసక్తే లేదు.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ స్పష్టం
తాజావార్తలు
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!