CM KCR: నాంపల్లి ప్రమాద ఘటన.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలో జరిగి భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారితో సహా 9మంది మృతిచెందారు. దీంతో నాంపల్లి ప్రమాద ఘటన వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. నాంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించడానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
ఈ ప్రమాదంలో జాకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా, మహ్మద్ ఆజం (53), తూభా (5), రెహమాన్ రెహనా సుల్తానా (50), తరుబా (12), డాక్టర్ ఫర్హీన్ (36), ఫైజా సమీన్ (25). డా. సెలవుల కారణంగా ఫర్హీన్ తన పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమాచారం రాబట్టారు. ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. సోమవారం సాయంత్రంలోగా ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాంటి గోదాముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
Revanth Reddy: వరుస అగ్ని ప్రమాదాలు.. చర్యలు చేపట్టడంలో సర్కార్ విఫలం
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!