CM KCR: నాంపల్లి ప్రమాద ఘటన.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలో జరిగి భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారితో సహా 9మంది మృతిచెందారు. దీంతో నాంపల్లి ప్రమాద ఘటన వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. నాంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించడానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
ఈ ప్రమాదంలో జాకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా, మహ్మద్ ఆజం (53), తూభా (5), రెహమాన్ రెహనా సుల్తానా (50), తరుబా (12), డాక్టర్ ఫర్హీన్ (36), ఫైజా సమీన్ (25). డా. సెలవుల కారణంగా ఫర్హీన్ తన పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమాచారం రాబట్టారు. ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. సోమవారం సాయంత్రంలోగా ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాంటి గోదాముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
Also Read
Revanth Reddy: వరుస అగ్ని ప్రమాదాలు.. చర్యలు చేపట్టడంలో సర్కార్ విఫలం
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!