CM KCR Review: నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష.. ఇంజనీర్స్ తో కేసీఆర్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Review: నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో వెట్ రన్ కు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 లేదా 17న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కరివెన జలాశయం వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై సీఎం దృష్టి సారించి.. కాల్వల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అన్న అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్లో ఇటీవల నిర్వహించిన డ్రై రన్ను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ వద్ద 4 మోటార్లు బిగించారు. మొదటి పంపు విజయవంతంగా పరీక్షించబడింది. వచ్చే 15 రోజుల్లో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక మోటారు 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ నిండిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీటిని తీసుకెళ్లనున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చిన 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది పగలు, రాత్రి పని చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న సమస్యలు, పనులు మిగిలిపోయాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిల వద్ద డీప్ కట్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్ జిల్లాకు విపత్తుగా అభివర్ణించిన విషయం తెలిసిందే..
Tirupati Crime: ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆస్తి చిచ్చు పెట్టింది..!
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!