CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన.. శివారెడ్డిపల్లిలో భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 8రోజులే సమయం ఉండటంతో పార్టీ నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక్కరోజులోనే మూడు, నాలుగు నియోజక వర్గాల్లో ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ తెలంగాణలో అధికారం సాధించుకునేందుకు ముందుకు సాగుతున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ఇవాళ మానకొండూరు, స్టేషన్ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సభా వేదిక వద్దకు రానున్నారు. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా ప్రజలు రానున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నాయకులు బహిరంగ సభ వేదికను పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మానకొండుర్ నియోజకవర్గం తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి స్టేషన్ఘన్పూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ ఎస్ శ్రేణులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీ జనసమీకరణకు దిశానిర్దేశం చేశారు. నగర శివారు శివారెడ్డిపల్లి మైదానంలో జరిగే భారీ ఎన్నికల ర్యాలీకి సర్వం సిద్ధమైంది. వేదిక, హాల్ కాంప్లెక్స్, కుర్చీలు, లైటింగ్, గుడారాలు తదితర ఏర్పాట్లు చేశారు. సోమవారం కేసీఆర్ రాకను పురస్కరించుకుని సభ వాతావరణం శోభాయమానంగా మారింది. బహిరంగ సభ ప్రాంగణం, కార్యక్రమ వేదిక వద్ద ఎలాంటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేదిక నిర్మాణం, బారికేడింగ్, గ్రౌండ్ లెవలింగ్, లైటింగ్, సౌండ్ ఏర్పాట్లు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో సభా వేదికకు చేరుకుని బహిరంగ ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో జరుగుతున్న ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read
స్టేషన్ఘన్పూర్ చరిత్ర సృష్టించేందుకు రాఘవపూర్-నష్కల్ గ్రామాల శివారులోని 50 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గుడారాలు, వేలాది మంది కూర్చునేందుకు కుర్చీలు, లక్షల్లో మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు, అంబులెన్స్లు, వైద్యబృందాలు, వాహనాల పార్కింగ్ ఇలా అన్ని ఏర్పాట్లు చేసింది జర్మన్ ఫార్మేషన్స్. హెలిప్యాడ్ నుంచి సభా స్థలికి చేరుకుని తిరిగి రావడానికి 5 నిమిషాల సమయం పట్టేలా హెలిప్యాడ్ డిజైన్ చేశారు. లక్ష మందికి పైగా ఉండే మైదానంలో బారికేడ్లు, గుంతలు, టెంట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. బందోబస్తు, వీవీఐపీ, వీఐపీ వాహనాల పార్కింగ్తోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై పోలీసు అధికారులు నిఘా ఉంచారు. మండలంలోని శివారెడ్డిపల్లిలో నేడు సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న జన్ ఆశీర్వాద సభకు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నట్లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం బహిరంగ సభ ఏర్పాట్లను, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
OTT Release Movies: ఈ వారం ఓటీటిలో 24 సినిమాలు రిలీజ్.. ఆ సినిమాలు స్పెషల్..!
తాజావార్తలు
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!