హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్ రావు.. దళిత బంధు పథకాన్ని పైలట్గా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కాదు.. ప్రతిపక్షాల విమర్శలకు సైతం తన దైన శైలిలో.. పథకాల ద్వారా లబ్ధిపొందాలని చూడమా? మాది రాజకీయా పార్టీ కాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.. ఇక. తాజాగా.. ఆ ప్రాంత ఎంపీటీసీకి ఫోన్ చేసి.. కేసీఆర్ నెరిపిన సంభాషణ ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి ఇవాళ ఫోన్ చేసిన కేసీఆర్.. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న ప్రగతిభవన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దళిత బంధు గురించి అన్ని గ్రామాల్లో తెలియజేయాలన్నారు. హుజూరాబాద్లో దళిత బంధు విజయంపైనే ఎస్సీల భవిష్యత్ ఆధారపడి ఉందని సీఎం పేర్కొన్నారు.. ఇక, కేసీఆర్ ఫోన్ సంభాషణ కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
