NTV Telugu Site icon

Mallannasagar: నేడు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశయంను ప్రారంభించ‌నున్న కేసీఆర్‌…

సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ మండ‌లం ప‌రిధిలోనున్న మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ జ‌లాశయంను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించ‌నున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద‌దైన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అంకితం చేయ‌నున్నారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ పూర్తిసామ‌ర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో 30 టీఎంసీల నీటిని జంట‌న‌గ‌రాల తాగునీటికోసం త‌రలిస్తారు. పారిశ్రామిక అవ‌సరాల‌కోసం 16 టీఎంసీల నీటిని వినియోగించ‌నున్నారు. ఈ మ‌ల్ల‌న్నసాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కింద కొత్త‌పాత ఆయ‌క‌ట్టు క‌లిపి మొత్తం 15,71,050 ఎక‌రాలు రానున్నాయి. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున మొత్తం ఐదు అంచెల్లో ప్రాజెక్టు నిర్మాణం జ‌రిగింది. ఈ మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా ఏడు జిల్లాలు, 9 నియోజ‌క‌వ‌ర్గాలకు తాగునీరు అంద‌బోతున్న‌ది.

Read: Viral: సైకిల్ రేసింగ్‌పై బుల్ హిట్‌… దూరంగా తీసుకెళ్లినా…