Bhatti Vikramarka: పాదయాత్రలో కల్లు తాగిన భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళమెత్తాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడడంతో… ఆయన కల్లు రుచి చూశారు.
Read Also: High Court: వెంటనే గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తెరవాలి.. హైకోర్టు ఆదేశాలు
Also Read
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ఇక, పీపుల్స్ మార్చ్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. ప్రజల కోసం చేసే పీపుల్స్ మార్చ్ ను వ్యతిరేకించే వాళ్ళని దూరం ఉంచాలని సూచించిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకం పేరుతో ఆడపిల్లలకు మూడు లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు.. సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినందుకు పాలాభిషేకం చేయాలా? అంటూ కేసీఆర్పై ఫైర్ అయిన ఆయన.. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందించామని.. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను మధ్యవర్తులుగా మార్చిందని విమర్శించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్దేనని.. రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్కు ఉరి వేయడం ఖాయమని జోస్యం చెప్పిన భట్టి.. ప్రజలకు ప్రజావ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. బీజేపీకి పనిచేస్తానన్న కేసీఆర్.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని ఎలా కలిసారు అని నిలదీశారు భట్టి విక్రమార్క.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన ఆయన.. సుబ్రమణ్యస్వామిని ఎందుకు కేసీఆర్ కలిసాడో బయట పెట్టాలని డిమాండ్ చేశారు..
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!