Bhatti Vikramarka: పాదయాత్రలో కల్లు తాగిన భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళమెత్తాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడడంతో… ఆయన కల్లు రుచి చూశారు.
Read Also: High Court: వెంటనే గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తెరవాలి.. హైకోర్టు ఆదేశాలు
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక, పీపుల్స్ మార్చ్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. ప్రజల కోసం చేసే పీపుల్స్ మార్చ్ ను వ్యతిరేకించే వాళ్ళని దూరం ఉంచాలని సూచించిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకం పేరుతో ఆడపిల్లలకు మూడు లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు.. సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినందుకు పాలాభిషేకం చేయాలా? అంటూ కేసీఆర్పై ఫైర్ అయిన ఆయన.. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందించామని.. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను మధ్యవర్తులుగా మార్చిందని విమర్శించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్దేనని.. రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్కు ఉరి వేయడం ఖాయమని జోస్యం చెప్పిన భట్టి.. ప్రజలకు ప్రజావ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. బీజేపీకి పనిచేస్తానన్న కేసీఆర్.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని ఎలా కలిసారు అని నిలదీశారు భట్టి విక్రమార్క.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన ఆయన.. సుబ్రమణ్యస్వామిని ఎందుకు కేసీఆర్ కలిసాడో బయట పెట్టాలని డిమాండ్ చేశారు..
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!