TS School Timing: స్కూల్ టైమింగ్స్లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School Timing: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్లో అయితే పాఠశాలలు కొంత సమయం ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, పొద్దున్నే నిద్రలేవరని ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు తెరవాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పిల్లలు హైస్కూళ్లలో చదువుతున్నందున ఉదయం 9గంటలకే పాఠశాలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం స్కూల్ టైమింగ్స్ విరుద్ధంగా ఉన్నాయని.. అందుకే వాటిని మార్చాలని కోరుతున్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేళల మార్పుపై ఎస్సీఈఆర్టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు తర్వాత పాఠశాల సమయాల్లో మార్పులు ఉండవచ్చు.
Read also: బ్యూటీ విత్ బ్రెయిన్.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
మరోవైపు పాఠశాలల సమయాలను మార్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించడంతోపాటు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు ఉదయం 9 గంటలకు ముందే వెళతారని చెబుతున్నారు. పాఠశాలలు ఆలస్యంగా తెరిస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హైస్కూల్కు పక్క గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారని, అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తున్నారని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామంలోనే ఉండడంతో ఆలస్యంగా తెరవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల సమయపాలనకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్కు హైకమాండ్ పిలుపు
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..