TS School Timing: స్కూల్ టైమింగ్స్లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School Timing: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్లో అయితే పాఠశాలలు కొంత సమయం ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, పొద్దున్నే నిద్రలేవరని ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు తెరవాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పిల్లలు హైస్కూళ్లలో చదువుతున్నందున ఉదయం 9గంటలకే పాఠశాలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం స్కూల్ టైమింగ్స్ విరుద్ధంగా ఉన్నాయని.. అందుకే వాటిని మార్చాలని కోరుతున్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేళల మార్పుపై ఎస్సీఈఆర్టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు తర్వాత పాఠశాల సమయాల్లో మార్పులు ఉండవచ్చు.
Read also: బ్యూటీ విత్ బ్రెయిన్.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
మరోవైపు పాఠశాలల సమయాలను మార్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించడంతోపాటు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు ఉదయం 9 గంటలకు ముందే వెళతారని చెబుతున్నారు. పాఠశాలలు ఆలస్యంగా తెరిస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హైస్కూల్కు పక్క గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారని, అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తున్నారని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామంలోనే ఉండడంతో ఆలస్యంగా తెరవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల సమయపాలనకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్కు హైకమాండ్ పిలుపు
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!