TS School Timing: స్కూల్ టైమింగ్స్లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School Timing: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్లో అయితే పాఠశాలలు కొంత సమయం ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, పొద్దున్నే నిద్రలేవరని ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు తెరవాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పిల్లలు హైస్కూళ్లలో చదువుతున్నందున ఉదయం 9గంటలకే పాఠశాలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం స్కూల్ టైమింగ్స్ విరుద్ధంగా ఉన్నాయని.. అందుకే వాటిని మార్చాలని కోరుతున్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేళల మార్పుపై ఎస్సీఈఆర్టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు తర్వాత పాఠశాల సమయాల్లో మార్పులు ఉండవచ్చు.
Read also: బ్యూటీ విత్ బ్రెయిన్.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
మరోవైపు పాఠశాలల సమయాలను మార్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించడంతోపాటు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు ఉదయం 9 గంటలకు ముందే వెళతారని చెబుతున్నారు. పాఠశాలలు ఆలస్యంగా తెరిస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హైస్కూల్కు పక్క గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారని, అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తున్నారని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామంలోనే ఉండడంతో ఆలస్యంగా తెరవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల సమయపాలనకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్కు హైకమాండ్ పిలుపు
తాజావార్తలు
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!