Telangana Telugudesam: పార్టీ నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం పై చర్చించాం. నెలలో రెండు రోజుల సమయం తెలంగాణకు బాబు కేటాయిస్తానన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. టీడీపీ పుట్టిన గడ్డ మీద పార్టీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 22 నుండి డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటు..రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు.
Also Read
Read Also:Chandrababu: బొజ్జల ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత.. కారణం ఏంటంటే..?
ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణకు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటుచేయనున్నారు. వారం రోజుల్లో చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహిస్తా అన్నారు. గ్రామ స్థాయి నుండి అనుబంధ సంఘాల ఏర్పాటుకు అన్ని కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై విస్తృత పోరాటం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై రెండు కమిటీల ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నిర్మాణం పై దృష్టి సారించామని నర్సిరెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!