Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chada Venkat Reddy Fires On PM Modi Over Manipur Incident: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ దుర్మార్గానికి వాళ్లిద్దరే బాధ్యత వహించాలని అన్నారు. మణిపూర్లో శాంతి నెలకొల్పి, కుకీ గిరిజన వర్గానికి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన మణిపూర్ ఘటనపై జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు. అలాగే.. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతోనూ డిపోల ముందు ధర్నాలు చేపడతామన్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రజాసమస్యలపై కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో సీఎం కేసీఆర్ విఫలమాయ్యారని విమర్శించారు.
Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
అంతకుముందు కూడా.. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు చాడ వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. నేటికి గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించలేదని, దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తులు పెరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీల్లోని ఆయా విభాగాల్లో మొత్తం 50,000 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్లు చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడంతో పాటు వేతనాలకు పెంచాలని, ఇతర న్యాయమైన డిమాండ్లని కూడా పరిష్కరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Gudivada Amarnath: లారీ ఎక్కి ఊగిపోతే ఎలా తెలుస్తుంది..? పవన్పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!