Site icon NTV Telugu

కోకాపేట భూములపై సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు !

Revanth Reddy

Revanth Reddy

కోకాపేట భూములపై సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని,.. ఈ కుంభకోణంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఢిల్లీకి వెళ్లి కేసీఆర్‌ సర్కార్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. కుంభకోణాల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని… కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపించారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని… ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్స్ కోరానని తెలిపారు. కేసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికార బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు రేవంత్ రెడ్డి.

Exit mobile version