Nagarjuna Sagar: మా విధులు అడ్డుకున్నారు.. ఏపీ లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అలాగే స్పందించారు. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో సాగర్ చేరుకున్నారు. ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఈరోజు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై సెక్షన్ 447, 341, రెడ్ విత్ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సాగర్ డ్యామ్పై తెలంగాణ పోలీసులు తమ విధులను అడ్డుకున్నారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Religious Conversion: ఉత్తర ప్రదేశ్ లో మత మార్పిడి కేసులో 9 మంది అరెస్టు
Also Read
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
నాగార్జున సాగర్పై దాడులు చేసిన ఏపీ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులపై తెలంగాణలో కేసు నమోదైన విషయం తెలిసిందే.. తెలంగాణకు చెందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని తెలంగాణకు చెందిన అధికారులు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 441, 448, 427 కింద కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు.. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. ఒక కమాండెంట్ మరియు 60 మంది సిబ్బంది రాత్రి 9 గంటలకు విజయపురి సౌత్కు వచ్చారు. వీరికి ఏపీఆర్జేసీ కళాశాలలో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం ఇరువైపులా మోహరించిన రెండు రాష్ట్రాల పోలీసులను పంపి కేంద్ర బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తాయి. శుక్రవారం కూడా రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు, జేసీబీలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డుకు చెందిన అజయ్ కుమార్ గుప్తాతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు తెలంగాణ వైపు ఉన్న విజయ విహార్ అతిథి గృహంలో బస చేసి వివరాలు సేకరించారు. ఏపీ తీరు సరికాదన్న అభిప్రాయానికి వచ్చిన వెంటనే నీటి విడుదల నిలిపివేయాలని లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే..
Liquor Shops: కొత్తగా మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!