MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎన్నికల ఎఫ్ఎస్టీ ఇన్చార్జి విజయేంద్రరావు ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారారని, జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డంకిగా మారారని ఫిర్యాదు చేశారు. మరియు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ఎంపీపీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read also: Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
అరవింత్ కేసులు ఇవే..
3 జనవరి 2022లో..
నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరవింద్పై ఐపీసీ సెక్షన్లు 504, 55 (2), 506 కింద కేసు నమోదు చేశారు.ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది నవంబర్ 8న బోయిన్పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
25 ఆగస్టు 2023న మరో కేసు
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్లో జరిగిన ఓ సభలో తాను ఎవరికి ఓటేసినా.. చివరకు గెలుపొందేది తనేనని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడమేనని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ గుప్తా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అరవింద్ తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అరవింద్ వ్యాఖ్యలతో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అరవింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లైక్ ఖాన్, నాంపల్లి కోర్టు న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?