Rajendranagar: బాలికల అనాథాశ్రమంలో కేర్ టేకర్ దారుణం.. పురుషుల ఎదుట దుస్తులు విప్పించి..
- రాజేంద్రనగర్ అనాథాశ్రమం లో దారుణం..
- అనాధ బాలికల దుస్తులు విప్పి మగవాళ్ళ ముందు నిలబెడుతున్న కేర్ టేకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar: హైదరాబాద్ రాజేంద్రనగర్ అనాథాశ్రమంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అందులో కేర్ టేకర్ గా పనిచేస్తున్న సునీత అనాధ బాలికల దుస్తులు విప్పి మగవాళ్ళ ముందు నిలబెడుతూ అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో కేర్ టేకర్ ప్రవర్తనతో విసుగు చెందిన అనాథ బాలికలు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ కి చెప్పారు. దీంతో చలించిపోయిన స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షి టీమ్స్ కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు.
అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూరలో 15 సంవత్సరాల క్రితం అనాథాశ్ర మాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలున్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్ గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళను ఆమె స్థానంలో నియమించారు. కొత్తగా చేరిన కేర్ టేకర్ బాలికలను చిత్రహింసలు పెట్టసాగింది. విసుగు చెందిన బాలికలు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈవిషయాన్ని వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు, షీ టీమ్ కు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికలతో మాట్లాడారు. దీంతో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులిప్పించి అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెడుతోందని బాలికలు పోలీసులకు తెలిపారు. నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాధాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వేధింపుల విషయం తెలుసుకుని చలించిపోయిన అక్కడి ప్రధానోపాధ్యాయురాలు శుక్రవారం సమస్య తీవ్రంగా ఉండటంతో ఉపాధ్యాయులతో కలిసి బాలికలు రాజేంద్రనగర్ రాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో ఆదేశాల మేరకు పోలీసులు కేర్ టేకర్ సునీతను రాణాకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు. కాగా మహిళా శిశు సంక్షేమ అధికారులు రాణాకు చేరుకుని బాలికలను పరామర్శించారు.
Foxtail Millet: షుగర్ పేషెంట్స్కు కొర్రలు నిజంగానే మేలు చేస్తాయా..?
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?