Rajendranagar: బాలికల అనాథాశ్రమంలో కేర్ టేకర్ దారుణం.. పురుషుల ఎదుట దుస్తులు విప్పించి..
- రాజేంద్రనగర్ అనాథాశ్రమం లో దారుణం..
- అనాధ బాలికల దుస్తులు విప్పి మగవాళ్ళ ముందు నిలబెడుతున్న కేర్ టేకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar: హైదరాబాద్ రాజేంద్రనగర్ అనాథాశ్రమంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అందులో కేర్ టేకర్ గా పనిచేస్తున్న సునీత అనాధ బాలికల దుస్తులు విప్పి మగవాళ్ళ ముందు నిలబెడుతూ అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో కేర్ టేకర్ ప్రవర్తనతో విసుగు చెందిన అనాథ బాలికలు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ కి చెప్పారు. దీంతో చలించిపోయిన స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షి టీమ్స్ కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు.
అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూరలో 15 సంవత్సరాల క్రితం అనాథాశ్ర మాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలున్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్ గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళను ఆమె స్థానంలో నియమించారు. కొత్తగా చేరిన కేర్ టేకర్ బాలికలను చిత్రహింసలు పెట్టసాగింది. విసుగు చెందిన బాలికలు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈవిషయాన్ని వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు, షీ టీమ్ కు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికలతో మాట్లాడారు. దీంతో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి.
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులిప్పించి అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెడుతోందని బాలికలు పోలీసులకు తెలిపారు. నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాధాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వేధింపుల విషయం తెలుసుకుని చలించిపోయిన అక్కడి ప్రధానోపాధ్యాయురాలు శుక్రవారం సమస్య తీవ్రంగా ఉండటంతో ఉపాధ్యాయులతో కలిసి బాలికలు రాజేంద్రనగర్ రాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో ఆదేశాల మేరకు పోలీసులు కేర్ టేకర్ సునీతను రాణాకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు. కాగా మహిళా శిశు సంక్షేమ అధికారులు రాణాకు చేరుకుని బాలికలను పరామర్శించారు.
Foxtail Millet: షుగర్ పేషెంట్స్కు కొర్రలు నిజంగానే మేలు చేస్తాయా..?
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!