Anantgiri Hills: ఎంజాయ్ చేసుకోమంటే రేసింగ్.. అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantgiri Hills: హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కూడా బడాబాబులు పిల్లలు కార్ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కార్లు, బైక్ లతో సందడి చేస్తున్నారు. మితిమీరిన వేగంతో పరుగెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు బైక్ రేసర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ప్రకృతి అందాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో బైక్లు, కార్లతో రేసింగ్లు చేస్తూ కలకలం సృష్టించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర రేసింగ్ నిర్వహించి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా ఉన్న అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో విన్యాసాలు దుమ్ము లేపారు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.
Read also: KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
అనంతగిరి కొండలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్ఐ, సిబ్బంది పహారా కాస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో వారు కూడా గైర్హాజరు కావడంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయారు. బైక్లు, కార్లను విడివిడిగా నడుపుతూ హంగామా చేశారు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు రేసింగ్లు ప్రారంభించారు. ఆనందకరమైన అనంతగిరి కొండలలో రేసింగ్లకు అనుమతి లేదు. కానీ కొందరు అటవీ శాఖ సిబ్బంది కొండపైకి అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణం ఇలాంటి రేసింగ్ వల్ల దెబ్బతినకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. వారందరూ తాగి బైక్, కార్లు రేసింగ్ తో ప్రశాంత వాతావరణాన్ని దుమ్మురేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివ వారికి అనంతగిరి కొండలపై అనుమతించకూడదని, ప్రతి ఒక్కరికి తనిఖీలు నిర్వహించి అనుమతించాలని కోరుతున్నారు. ఇలాంటి బడాబాబుల పిల్లల వల్ల అక్కడకు వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని మండిపడుతున్నారు.
KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..