NTV Telugu Site icon

Revanth Reddy: అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి..

Revanth

Revanth

Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేసి, సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు. నిన్నటి నుంచి హైకమాండ్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై తలమునకలై ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియన్ నేత కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిన్నటి నుంచి సీఎం అభ్యర్థి ఎంపికపై భేటీలు నిర్వహిస్తు్న్నారు.

Read Also: India-Pak: భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు.. పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతి..

ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హోటల్ ఎల్లా నుంచి హుటాహుటిన రేవంత్ రెడ్డి ఢిల్లీని పయణమయ్యారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీకి డీకే శివకుమార్, థాక్రేతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గం కూర్పుపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.