Site icon NTV Telugu

చార్మినార్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్…హత్య

చార్మినార్ లో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి మరీ… హత్య చేశారు. అయితే.. ఈ హత్యను అతని మిత్రులే చేయటం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19వ తేదీన వ్యాపార వేత్త మధుసూదన్ రెడ్డి ని అతని మిత్రులు కిడ్నాప్ చేశారు. మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్న మిత్రులు… తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేశారు. అయితే… కిడ్నాప్‌ తో ఆగకుండా అతన్ని మర్డర్‌ చేశారు. చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి సంగారెడ్డి లో హత్య చేశారు. మధుసూదన్ రెడ్డిని హత్య చేసి పొలంలో పాతిపెట్టారు అతని మిత్రులు. అయితే… మధుసూదన్ రెడ్డి కిడ్నప్ హత్య కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే జగ్గనాథ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు చార్మినార్ పోలీసులు. మధుసూదన్ రెడ్డి ను కిడ్నాప్ చేసి సంగారెడ్డి వరకు కారులో తీసుకెళ్లిన నలుగురు కిడ్నాపర్లు… అక్కడే హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Exit mobile version