Dr K Laxman: సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలను చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. మాతృ మూర్తుల కోసం ప్రధాని పౌష్ఠిక ఆహారం పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందనేది అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తుందన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం కూలీ పోవాలని బీజేపీ కోరుకోవడం లేదన్నారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం పడిపోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు వచ్చి కలుస్తున్నారని తెలిపారు. మా ప్రభుత్వానికి అండగా ఉంటామని చెబుతున్నారని రేవంత్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కి ఎందుకు అంత అభద్రతా భావం ఉంది? అని ప్రశ్నించారు.
Read also: Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీ లు అమలు చేసి సజావుగా పాలించాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. కానీ మీ వైఫల్యాలను చూసి ప్రజల తిరుగుబాటుకు దారి తీస్తే మాత్రం.. మిమ్మల్ని కాపాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పడం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని తెలుస్తుందన్నారు. కానీ.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి మాపై కుట్రలు పన్నుతున్నారని మీరే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీతో ఉన్నారు, కాబట్టి ప్రజలకు అర్థం అవుతుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని.. అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మోడీ నాయకత్వం చూస్తున్నారన్నారు. ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉందన్నారు. మీ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి బి అర్ ఎస్ ను హక్కున చేర్చుకుంటామంటే మాకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. మీరు బీఆర్ఎస్ ఒక్కటైనా.. మోడి నాయకత్వంలో ప్రజలు మా వెంట ఉన్నారని తెలిపారు. కాబట్టి దేశ వ్యాప్తంగా 400 పై సీట్లు సాధించి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్య..!