Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Moves Close To Dalits With The Dalithathidhyam Program

Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్‌గా బీజేపీ దళితాతిథ్యం?

Published Date :July 3, 2022 , 12:25 pm
By NTV WebDesk
Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్‌గా బీజేపీ దళితాతిథ్యం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకానికి పొలిటికల్‌గా కౌంటర్‌ ప్రోగ్రామ్‌ని బీజేపీ ప్రారంభించిందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే కమలదళం తెలంగాణలో దళితాతిథ్యం అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు దళితుల ఇళ్లకు అతిథులుగా వెళ్లి వాళ్ల ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆయా కుటుంబాలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. వాళ్ల కష్టసుఖాలను, బాధలను, సంతోషాలను అడిగి తెలుసుకుంటున్నారు. మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. తద్వారా దళితులను బీజేపీకి దగ్గర చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

వాళ్లను పార్టీకి ఓటు బ్యాంకుగా మలచుకునే ప్రణాళికను ఆచరణలో పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయటానికి ఈవిధంగా కూడా రంగంలోకి దిగారు. ఈ మేరకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ మొన్న శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా జైనాద్‌ మండల కేంద్రంలోని మహరాజుల కాలనీలో ఉన్న అల్లంకొండ ఉషన్న అనే దళితుడి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులూ ఉన్నారు. అనంతరం అక్కడి పురాతన సూర్యనారాయణ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్‌ మోర్చా నేతలతో సమావేశం నిర్వహించారు.

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
  • Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్

సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ పేరుతో కోట్ల రూపాయలను అనుత్పాదక పథకాలకు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎలక్షన్స్‌ జరగొచ్చని, దీనికి పార్టీ శ్రేణులు, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే దళితులకు చేరువయ్యేందుకు బీజేపీ ఈ కార్యక్రామాన్ని ‘జన్‌ సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా చేపట్టింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ ఇటీవలే పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా బీజేపీ ప్రారంభించిన ఈ ‘దళితాతిథ్యం’ తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న దళితబంధుకి కౌంటర్‌ కాదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఈ పథకాన్ని దుబ్బాక ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెర మీదికి తెచ్చింది. కానీ ఆశించిన ప్రయోజనాన్ని పొందలేకపోయింది. ఆ బైఎలక్షన్‌లో గులాబీ పార్టీ అభ్యర్థి గెలవలేదు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందరే నెగ్గాడు. అయినా ఆ స్కీమ్‌ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించే ప్రక్రియ నడుస్తోంది.

అసలే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేనందున దళితబంధు అర్హులందరికీ డబ్బులు ఇస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దుబ్బాక ఫలితాన్నిబట్టి ఈ ఒక్క పథకమే టీఆర్‌ఎస్‌ని మళ్లీ గెలిపిస్తుందనే గ్యారెంటీ సైతం లేదు. కాబట్టి దళితబంధును చూసి కాషాయ శిబిరం కలవరపాటుకు గురికావాల్సిన అవసరంలేదు. కాకపోతే రాజకీయ పార్టీ అన్నాక, అందునా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి తామే బలమైన ప్రత్యర్థి అని చెప్పుకుంటున్నందున బీజేపీ ఈ దళితాతిథ్యానికి రూపకల్ప చేసినట్లు అర్థంచేసుకోవచ్చి రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp leaders visit dalit houses
  • Dalit outreach programme
  • Dalithathidhyam programme in telangana

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions