Geetha Murthy: డ్రగ్స్లో, విమెన్ ట్రాఫికింగ్లో తెలంగాణ నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Geetha Murthy Responds On Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ఘటన చోటు చేసుకోవడానికి తెలంగాన ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తూతూమంత్రంగా విచారణ చేస్తోందని సరిపోదని అన్నారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, వాటి మధ్య ఆపరేషన్లు నిర్వహించారని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్లో, విమన్ ట్రాఫికింగ్లో, మహిళలపై దాడుల్లో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఘటనకి బాధ్యత వహిస్తూ.. మంత్రి హరీష్ రావుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని.. సరైన వసతులు, భోజనం దొరక్క విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని గీతా మూర్తి పేర్కొన్నారు. ఐఐటీలో స్టూడెంట్ చనిపోయినా కూడా ప్రభుత్వానికి పట్టదని, విద్యా మంత్రిగా ఉన్న సబిత తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. మహిళా ముఖ్యమంత్రి లేదని తాము కొట్లాడామని, అప్పుడు సత్యవతి రాథోడ్కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆ మంత్రి కూడా తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతుంటే.. చోద్యం చూస్తున్నారే తప్ప, పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థినులపై లైంగిక దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా.. కనీసం పరామర్శ కూడా ఉండట్లేదని ఆగ్రహించారు. అలాంటి సత్యవతిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
కాగా.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై వెళ్లగా, ఆమెతో గీతా మూర్తి కలిశారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బ్రహీంపట్నం ఘటనపై న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని గీతా మూర్తి వెల్లడించారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 1 కోటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని.. అలాగే పిల్లల చదువులకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..