Bike thief: ఎంట్రా ఇదీ.. ఇలా కూడా చోరీ చేస్తారా?
Bike theft in Patan Cheru area: పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్. ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేసి పనులకు లోపల వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి వాహనదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగతనానికి గురి కావడంతో లబోదిబో మంటూ పోలీస్టేషన్ మొట్లు ఎక్కుతున్నాడు. నగరంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంకకుండా యదేశ్చగా దొంగతనం చేసేందుకు వెనకాడటం లేదు బైక్ దొంగలు. జిల్లా వ్యాప్తంగా బైక్ దొంగలు రెచ్చి పోతూ రోజుకు ఎదో ఒకచోట బైక్ ల చోరీకి పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి ఏమీ తెలియనట్టు అది తన బైక్ అయినట్లు బైక్ పై అక్కడనుండి వెళ్లిపోయాడు. అది చూసిన వాళ్లకు కూడా అనుమానం రాదు ఎందుకంటే ఆ దొంగ అంతగా దొంగతనం చేశాడు. అలా వచ్చి బైక్ పై కూర్చొని ఇలా వెళ్లిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పరిధిలోని శాంతినగర్ కాలనిలో చోటుచేసుకుంది.
Read also: Hebah Patel: చీర కట్టిన హెబ్బా.. అబ్బా.. అంటున్న అబ్బాయిలు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని శాంతినగర్ కాలనిలో నివాసం ఉంటున్న శివారెడ్డి అనే వ్యక్తి 5 నెలల క్రితమే పల్సర్ బైక్ కొన్నాడు. రాత్రి తన బైక్ ను రోజూలాగేనే ఇంటి ముందు పార్కింగ్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే దానిని గమనించిన ఓ దొంగ అలా వచ్చి బైక్ పై ఎక్కి తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఉదయం శివారెడ్డి చూడగా కంగుతిన్నాడు. తన బైక్ ఇక్కడే కదా పార్కింగ్ చేసింది ఎక్కడ పోయిందంటూ వెతికాడు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తన బైక్ మాయమైందని గ్రహించిన శివారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. 5 నెలల క్రితమే బైక్ కొన్నానని అది చోరీకి గురైందని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడున్న సీసీ ఫోటేజీని పరిశీలించారు. ఇంటి ముందు పార్కు చేసిన బైక్ ను రాత్రి 2 గంటల సమయంలో ఎంత సులువుగా ఎత్తుకెళుతున్నాడో సీసీ ఫోటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగ ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరు లేరని తెలుసుకొని బండి తనదే అన్నట్టు ఎంతో దర్జాగా తీసుకెల్లాడు. అంతే కాదు ఎదురుగా సీసీ కెమెరా ఉంది అని తెలిసినా నాకెందుకులే అనుకున్నాడే ఏమో బైక్ తో పరార్ అయ్యాడు దుండగులు. సీసీ కెమెరాలో రికార్డు అయినా ఈ దృష్యాల ఆధారంగా పోలీసులు బైక్ దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.
V. Hanumantha Rao: బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!