BJP Laxman: కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని, సీఎం తెలంగాణ పరువు తీశారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణా పరువు తీశారన్నారు. బీహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని, తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లారని, నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకుడా..? ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటం అన్నారని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందని విమర్శించారు.
గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదు, మరి తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఎంటి? ప్రశ్నించారు. ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోవడంలేదని సీరియస్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమై అదే ప్రపంచమనుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పాలనను ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మునుగోడు భయం కేసీఆర్ కు బాగా పట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. ఇక కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్న సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటే ఏం చేస్తున్నారని, క్యాబేజీ కర్ణాటక నుంచి, టమాట, బెండకాయలు ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని, ఆంద్రప్రదేశ్ లో రోజురోజుకు బీజేపీ పెరుగుతుందన్నారు. ఇక బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని తెలిపారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!