Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!
- పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం : భట్టి విక్రమార్క
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై తక్షణ సాయం ₹600 కోట్లు
- మిగిలిన బకాయిలు విడతల వారీగా చెల్లింపు హామీ
- ప్రభుత్వ నిర్ణయంతో కళాశాలల బంద్ విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : పేద విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యత: ఫీజు రీయింబర్స్మెంట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి, బకాయిల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు.
“ఆ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుండి రూ. 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ప్రతినెలా కొంత చొప్పున చెల్లిస్తూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్ను విరమించాయని తెలిపారు.
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?
చర్చల సందర్భంగా, కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా, ప్రభుత్వం అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే.. కళాశాల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ, “పాత ప్రభుత్వం చేసిన పాపాలు మా నెత్తిన బడినప్పటికీ, మా యందు దయతలచి రూ. 600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించింది. భవిష్యత్తులో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుందని ఆశిద్దాం.
Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
తాజావార్తలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!