కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటన తెలంగాణ వాసులకు ఆనందాతిశయాన్ని కలిగించింది. భద్రాద్రి మణుగూరు కు చెందిన వోకల్, ఫోక్ కళాకారుడు రామచంద్రయ్య అనే గిరిజనుడికి పద్మ శ్రీ అవార్డ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాలో రామ చంద్రయ్య (క్రమ సంఖ్య 96.) వుండడం రాష్ట్రానికే గర్వకారణం. మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం చాలా సంతోషమని, మన జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవం అన్నారు కలెక్టర్ అనుదీప్. పద్మ శ్రీ అవార్డు రావడం పట్ల రామచంద్రయ్య, ఆయన బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.