Gundala Village Demand: ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద ప్రభావంతో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వివిధ గ్రామాల వాసులు తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తెలంగాణ సహకారం లేకపోతే మా ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని గుండాల వాసులు అంటున్నారు.హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా ,రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. తెలంగాణ ప్రాంతం తమలో కలపాలని కోరుతున్న ఒక గ్రామంలో ఇది ఒక గ్రామం. అయితే.. కొద్ది రోజులుగా తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైద్య, విద్య, వ్యాపారపరంగా ఏ విధంగా చూసినా గత కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలతో కొనసాగిన అనుబంధమే తమకు అన్ని విధాల అనుకూలంగా ఉందని, రాష్ట్ర విభజనలో తమను ఏపీలో కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలీన పంచాయతీల ప్రజలు ఆవేదన వక్తం చేస్తున్నారు. తమను తెలంగాణ పరిధిలోని భద్రాచలంతోనే కొనసాగాలని ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వాసులు ముక్తకంఠంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
read also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
అయితే.. గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు పంచాయతీలను భద్రాద్రిలో విలీనం చేయాలనే డిమాండ్ ఇటీవల వచ్చిన మహావరద ముంపు అనంతరం తెరపైకి వచ్చింది. ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్తో ఆదివారం ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని యటపాక మండలం చెన్నంపేట వద్ద భారీ ధర్నా వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు పంచాయతీల వాసులతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రెండు ప్రాంతలకు చెందిన రాజకీయపక్షాలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నాయకులు క్షేత్రస్థాయిలో ఇంటింటా ప్రచారం చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!