Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే.. పీఆర్సీ దేవుడెరుగు జీతాలకే ఎసరు పెడతాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా? అని మండిపడ్డారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని సాక్షాత్తు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్… ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని మండిపడ్డారు. గడువు ముగిసిన 3 నెలల తరువాత నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మాత్రమే మధ్యంతర భ్రుతి ఇస్తున్నట్లు ప్రకటించి వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు 3 డీఏలు (10.92 శాతం) పెండింగ్ లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదమని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భ్రుతి ఇచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని పదేపదే మొత్తుకున్న కేసీఆర్… స్వరాష్ట్రం వచ్చాక కేవలం 5 శాతం మధ్యంతర భ్రుతి ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? మండిపడ్డారు. కేసీఆర్ పాలనా పుణ్యమా? అని 317 జీవో పేరుతో స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకీడుస్తున్నారని అన్నారు. బదిలీలు, ప్రమోషన్లు లేక అల్లాడుతున్నరని, ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో 5 శాతం మధ్యంతర భ్రుతి ప్రకటించడం.. ఉద్యోగులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టివేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని తెలిపారు.
రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదన్నారు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పీఆర్సీ అమలు దేవుడెరుగు 3, 4 నెలలకోసారి జీతాలు కూడా ఇవ్వలేని దుస్ధితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించి ఉద్యోగులకు మేలు కలుగుతుందని వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో అంటూ బండి సంజయ్ అన్నారు.
Minister KTR: రైతులకు అన్యాయం జరగకుండా జగిత్యాలలో మాస్టర్ ప్లాన్
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!