Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే.. పీఆర్సీ దేవుడెరుగు జీతాలకే ఎసరు పెడతాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా? అని మండిపడ్డారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని సాక్షాత్తు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్… ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని మండిపడ్డారు. గడువు ముగిసిన 3 నెలల తరువాత నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మాత్రమే మధ్యంతర భ్రుతి ఇస్తున్నట్లు ప్రకటించి వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు 3 డీఏలు (10.92 శాతం) పెండింగ్ లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదమని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భ్రుతి ఇచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని పదేపదే మొత్తుకున్న కేసీఆర్… స్వరాష్ట్రం వచ్చాక కేవలం 5 శాతం మధ్యంతర భ్రుతి ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? మండిపడ్డారు. కేసీఆర్ పాలనా పుణ్యమా? అని 317 జీవో పేరుతో స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకీడుస్తున్నారని అన్నారు. బదిలీలు, ప్రమోషన్లు లేక అల్లాడుతున్నరని, ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో 5 శాతం మధ్యంతర భ్రుతి ప్రకటించడం.. ఉద్యోగులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టివేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని తెలిపారు.
రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదన్నారు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పీఆర్సీ అమలు దేవుడెరుగు 3, 4 నెలలకోసారి జీతాలు కూడా ఇవ్వలేని దుస్ధితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించి ఉద్యోగులకు మేలు కలుగుతుందని వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో అంటూ బండి సంజయ్ అన్నారు.
Minister KTR: రైతులకు అన్యాయం జరగకుండా జగిత్యాలలో మాస్టర్ ప్లాన్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!