బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కరీంనగర్ స్థానిక కోర్టు తిరస్కరించడంతో.. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందే సంగతి తెల్సిందే.. బెయిల్ ఇప్పించాలని.. తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సంబంధించిన కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించారు. ఈ పిటిషన్ను సంబంధిత బెంచ్కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్ను న్యాయమూర్తి ఆదేశించారు.
హైకోర్డులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్
