రాష్ట్రం మర్చిపోతే కేంద్రం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనేక మంది బలిదానాలు, సర్ధార్ పటేల్ కృషి ఫలితంగా తెలంగాణ దేశంలో విలీనం అయిందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ళ తరువాత అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణకు వచ్చిందని బండి సంజయ్ అన్నారు. నిజాం, రజాకార్ల చేతిలో తెలంగాణ ప్రజలు.. హిందువులు చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్ లో కలుపుతా అని, లేదా ఒంటరి దేశంగా పెడ్తామన్నాడు నిజాం అన్నారు. నిజాం ఒక తుగ్లక్ అని బండి సంజయ్ అన్నారు. ఆపరేషన్ పోలో తో అన్ని సర్దుకుని నిజాం పారిపోయాడని అన్నారు. అనేక మంది దేశ భక్తులు కాల్చి చంపబడ్డారని బండి సంజయ్ తెలిపారు.
నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది పోరాడి.. కొట్లాడారని అన్నారు. తెలంగాణకు విమోచన దినోత్సవం అనే బీజేపీ అనేలా చేసారు కొందరు అని అన్నారు. ఇది తెలంగాణకు స్వతంత్రం.. స్వేచ్ఛ వచ్చిన రోజని తెలిపారు. రాష్ట్రం మర్చిపోతే కేంద్రం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షా సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అర్థం పర్థం లేకుండా పోటీగా రాష్ట్రం సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తుందని మండి పడ్డారు. ఇన్ని రోజులు ఎందుకు వేడుకలు జరపలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకు జరుపుతున్నావో సమాధానం చెప్పు కేసీఆర్? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. స్కూల్స్ కి సెలవు ప్రకటించడం అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు ఇవ్వకుండా వేడుకలు నిర్వహించమని ఆదేశాలు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లో వర్షబీభత్సం.. ఇళ్లు, గోడలు కూలి 22 మంది మృతి
