మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు వారికి కేటాయించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానుండటంతో మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. అయితే ఆ మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.
ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ, గతంలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్సీ కవిత. అయితే రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ ని కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రామగుండంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజ్ లో 25% ఎంబీబీఎస్ సీట్లను సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు మంత్రి కేటీఆర్ గారిని కోరారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణిలో ప్రస్తుతం కార్మికుల వారసులకు ఇస్తున్న ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లలో ఉన్న చిన్న చిన్న అక్షర దోషాలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలోనూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకునేలా సిఎండి తో మాట్లాడతామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్ రావు,ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ని కోరారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!