Balka Suman: బూర నర్సయ్యకు ఆ హక్కు లేదు.. ఇది బీజేపీ చిల్లర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman Fires On Boora Narsaiah Goud: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామాపై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. చండూరులో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. రాజీనామా లేఖలో బూర నర్సయ్య పేర్కొన్న అంశాలను టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బూర నర్సయ్యకు టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించిందని.. పూర్తి స్థాయిలో సహకరించిందని అన్నారు. టీఆర్ఎస్లో తనకు తగిన గౌరవం దక్కలేదని చెప్తున్న బూర నర్సయ్యకు తరుణ్ చుగ్ అప్పాయింట్మెంట్ కూడా దక్కలేదని.. అలాంటి వ్యక్తి ఆత్మాభిమానం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
2014, 2018 ఎన్నికల్లో నర్సయ్యకు టీఆర్ఎస్ పార్టీ అవకాశాలు కల్పించిందన్నారు. సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా.. వాటిని నర్సయ్య వినియోగించుకోలేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. పద్మశాలి, గౌడ్, ఇతర కుల వృత్తులకు ప్రాధాన్యతతో పాటు గౌరవం దక్కింది ఒక్క టీఆర్ఎస్ పాలనలోనేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత బూర నర్సయ్యకు లేదని, రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాల్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందని.. ప్రజా క్షేత్రంలోకి వెళ్ళలేకే ఆ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని బాల్క సుమన్ ఆరోపించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
అంతకుముందు.. మునుగోడుకు పట్టిన దరిద్రం పోయి అభివృద్ధి జరగాలంటే, ముందుగా రాజగోపాల్రెడ్డి శని వదిలిపోవాలని బాల్క సుమన్ విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి.. నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ, కేడీలు ఎంత మంది వచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని.. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేటీఆర్ రోడ్ షో తర్వాత పార్టీ క్యాడర్లో జోష్ మరింత పెరిగిందన్నారు. బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించిన బాల్క సుమన్.. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!