AV Solutions Scam : మాదాపూర్లో 850 కోట్ల స్కాం.. ఏవి సొల్యూషన్స్ మోసాల కుంభకోణం.!
- 3200 మందిని ముంచేసిన ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్
- నకిలీ అకౌంట్లలోకి పెట్టుబడిదారుల నిధులు మళ్లింపు
- ఏవి సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్, శ్రియస్ పాల్ అరెస్టులు
- షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధుల తరలింపు
AV Solutions Scam : హైదరాబాద్లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ స్కాం వెలుగుచూసింది. మాదాపూర్లో ఆధారంగా పనిచేసిన ఏవి సొల్యూషన్స్ , ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, 3200 మందికి పైగా బాధితుల నుండి సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెట్టుబడులు అన్నీ సురక్షితంగా ఉంటాయని, స్టాక్ మార్కెట్లో పెట్టితే అధిక లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి డిపాజిటర్లను ఆకర్షించారు.
Betting Apps Bill : ఆన్లైన్ గేమింగ్ కొత్త బిల్లు.. ఈ-స్పోర్ట్స్కు గ్రీన్ సిగ్నల్..కానీ ..!
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును నిజమైన పెట్టుబడులుగా మార్చకుండా, నకిలీ అకౌంట్లలోకి మళ్లించారు. స్టాక్ మార్కెట్లో బలమైన కంపెనీల ద్వారా లాభాలు వస్తాయని ప్రచారం చేసినప్పటికీ, వాస్తవానికి మొత్తం మోసపూరిత కార్యకలాపమేనని అధికారులు ధృవీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏవి సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎం.డి శ్రియస్ పాల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏవి సొల్యూషన్స్కి అనుబంధంగా దాదాపు 10 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కంపెనీల ద్వారా దేశంలో సేకరించిన నిధులను విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఏవి సొల్యూషన్స్, శ్రీనివాస అనల్టిక్, ట్రేడ్బుల్ టెక్నాలజీ, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేర్లతో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ సంస్థలు తమను BSE, SEBI లో నమోదు అయిన కంపెనీలుగా ప్రచారం చేసుకొని ప్రజలను నమ్మించారు. కానీ వాస్తవానికి పెట్టుబడులు అన్నీ మోసపూరిత పథకాలే. పలు రాష్ట్రాల్లో కూడా ఈ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Maoists : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. కీలక నేతలు పోలీసుల అదుపులో
తాజావార్తలు
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!