Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Kumar Yadav: తెలంగాణ సీఎం కేసీఆర్ను గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆశిష్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. శిథిలావస్తకు చేరుకున్న పురాతన కట్టడాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గోషామహల్ అభివృధికి కృషి చేయాలని సీఎంను కోరారు. ఆశిష్ కుమార్ యాదవ్ విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు ఆశిష్ కుమార్ వివరించారు. అనంతరం పుష్పగుచ్ఛంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసి నది నిండి బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలారు.. మూసి నది పరివాహక ప్రాంతం అయిన గోషామహల్ లోని లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను సూచించి వారికి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హల్ లకి తరలించాలని సూచించారు. వారందరికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆశిష్ కుమార్ యాదవ్ హిమాయత్ నగర్ జిల్లా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆశిష్ కుమార్ యాదవ్ అంకితభావం, ప్రజా సేవలో నిబద్ధతను చూసిన పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనుంది. రాజకీయాల పట్ల మక్కువతో అంకితభావం కలిగిన వ్యక్తి అయిన ఆశిష్ కుమార్ యాదవ్ 2006లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIలో చేరినప్పుడు తన కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఆశయం, సానుకూల మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో నిండిన ఆశిష్ కుమార్ యాదవ్ NSUIలో అంతర్భాగమయ్యారు. 2007లో ఆశిష్ కుమార్ యాదవ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIకి హైదరాబాద్ కన్వీనర్గా నియమితులయ్యారు. సంస్థ అతనికి అప్పగించిన ఈ ముఖ్య బాధ్యతలను అతని నాయకత్వ సామర్థ్యాలు, అంకితభావం, విద్యార్థుల సంక్షేమం, హక్కుల మెరుగుదల కోసం చురుకుగా పనిచేసిన నిరూపితమైన ట్రాక్ తనక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!