Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ
Ashish Kumar Yadav: తెలంగాణ సీఎం కేసీఆర్ను గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆశిష్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. శిథిలావస్తకు చేరుకున్న పురాతన కట్టడాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గోషామహల్ అభివృధికి కృషి చేయాలని సీఎంను కోరారు. ఆశిష్ కుమార్ యాదవ్ విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు ఆశిష్ కుమార్ వివరించారు. అనంతరం పుష్పగుచ్ఛంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!
Also Read
గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసి నది నిండి బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలారు.. మూసి నది పరివాహక ప్రాంతం అయిన గోషామహల్ లోని లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను సూచించి వారికి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హల్ లకి తరలించాలని సూచించారు. వారందరికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆశిష్ కుమార్ యాదవ్ హిమాయత్ నగర్ జిల్లా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆశిష్ కుమార్ యాదవ్ అంకితభావం, ప్రజా సేవలో నిబద్ధతను చూసిన పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనుంది. రాజకీయాల పట్ల మక్కువతో అంకితభావం కలిగిన వ్యక్తి అయిన ఆశిష్ కుమార్ యాదవ్ 2006లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIలో చేరినప్పుడు తన కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఆశయం, సానుకూల మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో నిండిన ఆశిష్ కుమార్ యాదవ్ NSUIలో అంతర్భాగమయ్యారు. 2007లో ఆశిష్ కుమార్ యాదవ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIకి హైదరాబాద్ కన్వీనర్గా నియమితులయ్యారు. సంస్థ అతనికి అప్పగించిన ఈ ముఖ్య బాధ్యతలను అతని నాయకత్వ సామర్థ్యాలు, అంకితభావం, విద్యార్థుల సంక్షేమం, హక్కుల మెరుగుదల కోసం చురుకుగా పనిచేసిన నిరూపితమైన ట్రాక్ తనక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!