Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Kumar Yadav: తెలంగాణ సీఎం కేసీఆర్ను గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆశిష్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. శిథిలావస్తకు చేరుకున్న పురాతన కట్టడాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గోషామహల్ అభివృధికి కృషి చేయాలని సీఎంను కోరారు. ఆశిష్ కుమార్ యాదవ్ విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు ఆశిష్ కుమార్ వివరించారు. అనంతరం పుష్పగుచ్ఛంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసి నది నిండి బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలారు.. మూసి నది పరివాహక ప్రాంతం అయిన గోషామహల్ లోని లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను సూచించి వారికి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హల్ లకి తరలించాలని సూచించారు. వారందరికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆశిష్ కుమార్ యాదవ్ హిమాయత్ నగర్ జిల్లా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆశిష్ కుమార్ యాదవ్ అంకితభావం, ప్రజా సేవలో నిబద్ధతను చూసిన పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనుంది. రాజకీయాల పట్ల మక్కువతో అంకితభావం కలిగిన వ్యక్తి అయిన ఆశిష్ కుమార్ యాదవ్ 2006లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIలో చేరినప్పుడు తన కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఆశయం, సానుకూల మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో నిండిన ఆశిష్ కుమార్ యాదవ్ NSUIలో అంతర్భాగమయ్యారు. 2007లో ఆశిష్ కుమార్ యాదవ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIకి హైదరాబాద్ కన్వీనర్గా నియమితులయ్యారు. సంస్థ అతనికి అప్పగించిన ఈ ముఖ్య బాధ్యతలను అతని నాయకత్వ సామర్థ్యాలు, అంకితభావం, విద్యార్థుల సంక్షేమం, హక్కుల మెరుగుదల కోసం చురుకుగా పనిచేసిన నిరూపితమైన ట్రాక్ తనక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?