NTV Telugu Site icon

బీజేపీపై ఒవైసీ సెటైర్లు.. ఇవి మంచి సంకేతాలేనా..?

Asaduddin Owaisi

మాజీ మంత్రి ఈట‌ల రాజేద‌ర్.. ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ… నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫ‌లితాల‌ను ప్ర‌స్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను ద‌క్కించుకోవ‌డంలో బీజేపీ విఫ‌ల‌మైంద‌ని ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. ఇక‌, హైదరాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయింద‌ని విమ‌ర్శించారు.. మ‌రోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిల్లో బీజేపీ నాల్గో స్థానానికే ప‌డిపోయింద‌ని సెటైర్లు వేశారు.. ఇవి అన్నీ మంచి సంకేతాలుగా భావిస్తున్నారా? అంటూ బీజేపీని ప్ర‌శ్నించారు అస‌దుద్దీన్ ఒవైసీ.