Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Annaram Barrage Desiltation Ndsa Safety Tests Controversy

Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?

Published Date :March 4, 2026 , 5:33 pm
By Gogikar Sai Krishna
  • Annaram Barrage వద్ద ఇసుక తవ్వకాలపై వివాదం
  • మేడిగడ్డ తర్వాత భద్రతపై పెరిగిన అనుమానాలు
  • National Dam Safety Authority సూచించిన 9 కీలక పరీక్షలు
  • పూడికతీతేనా? లేక ప్రాజెక్టుకు ముప్పా? అధికారుల వివరణ
Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజ్ గేట్ల వద్ద, పిల్లర్ల సమీపంలో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత, అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు ప్రాజెక్టు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీనిపై ‘NTV’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైన అసలు విషయాలు ఇవే.

అన్నారం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ (ఎగువన) , డౌన్ స్ట్రీమ్ (దిగువన) వందలాది లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గేట్లకు అత్యంత సమీపంలో, పిల్లర్ల (Piers) కింద ఇసుకను తోడేయడం వల్ల పునాదులు బలహీనపడి బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తి ఉంచడం వల్ల, ఈ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు ఆ ఇసుకను తీయడం వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా ఇది సాంకేతిక అవసరమా అన్నది వివాదంగా మారింది.

Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్‌కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..

ఈ వివాదంపై ఇరిగేషన్ శాఖ , తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TG-MDC) అధికారులు స్పష్టతనిస్తున్నారు. ఇది వాణిజ్యపరంగా ఇసుకను అమ్ముకోవడానికి చేస్తున్న తవ్వకం కాదని, కేవలం బ్యారేజ్ భద్రతను పరీక్షించడానికి చేపట్టిన ‘పూడికతీత’ (Desiltation) అని వారు చెబుతున్నారు.

గత రెండు సీజన్లలో సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్ల, బ్యారేజ్ వెంట్లలో సుమారు 15 అడుగుల (5 మీటర్లు) ఎత్తు వరకు ఇసుక పేరుకుపోయింది. దీనివల్ల గేట్లను కిందకు దించడం అసాధ్యంగా మారింది. మేడిగడ్డ తరహాలో ఇక్కడ కూడా లీకేజీలు ఉన్నాయన్న అనుమానంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రంగంలోకి దిగింది. బ్యారేజ్ పటిష్టతను తెలుసుకోవడానికి జియో-టెక్నికల్, జియో-ఫిజికల్ వంటి 9 రకాల కీలక పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

బ్యారేజ్ పునాదులు ఎంత లోతులో ఉన్నాయి? పిల్లర్ల కింద సిమెంట్ బ్లాకులు సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే భూమి లోపలికి రంధ్రాలు చేసి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే, 15 అడుగుల మేర ఉన్న ఇసుక అడ్డంకిగా మారడంతో, ఆ ఇసుకను తొలగిస్తేనే శాస్త్రవేత్తల బృందం పరీక్షలు చేయగలదని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇసుక తీసే సమయంలో బ్యారేజ్ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం నిరంతరం స్పాట్ లోనే ఉండి పర్యవేక్షిస్తోంది. పిల్లర్ల చుట్టూ ఇప్పటికే గ్రౌటింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి తీసిన ఇసుకను TG-MDC ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్ లో నిబంధనల ప్రకారమే విక్రయిస్తున్నామని, ఇందులో ఎటువంటి అక్రమాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.

మొత్తానికి అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలు కేవలం పూడికతీత మాత్రమేనని, బ్యారేజ్ భద్రతను నిరూపించే పరీక్షల కోసమే దీన్ని చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వర్షాకాలం లోపు ఈ పరీక్షలు పూర్తయితేనే అన్నారం బ్యారేజ్ భవితవ్యంపై ఒక స్పష్టత రానుంది.

Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annaram Barrage
  • Kaleshwaram project
  • NDSA
  • Telangana Irrigation News

తాజావార్తలు

  • Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?

  • Holi Evening Remedies for Money: హోలీ సాయంత్రం ఈ పనులు మాత్రం మరవకండి.. మీకు ఎంతో ధన లాభం..!

  • Bihar Next CM: బీహార్‌లో నితీష్ కుమార్ శకానికి అంతం.. తర్వాతి సీఎం ఈయనే..?

  • AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..

  • Dwcra Group: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. ప్రభుత్వం కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions