కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజ్ గేట్ల వద్ద, పిల్లర్ల సమీపంలో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత, అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు ప్రాజెక్టు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీనిపై ‘NTV’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైన అసలు విషయాలు ఇవే. అన్నారం బ్యారేజ్ అప్…