BJP Telangana: రేపు తెలంగాణకు అమిత్ షా.. ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Telangana: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా… వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలను గెలిపించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. అయితే మరోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా… ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో వీరు పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచి ఎన్నికల గ్యాప్ను బీజేపీ పూరించనుంది.
Read also: CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం..
Also Read
అమిత్ షా టూర్ షెడ్యూల్…
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్ వెళ్లారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సభ అనంతరం హైదరాబాద్ చేరుకుని… సికింద్రాబాద్ పార్లమెంట్లో పార్టీ నిర్వహిస్తున్న మేధావుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోపై చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోగా… ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో… రానున్న పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.
Read also: CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం..
మోడీ మేనియాతో పాటు పలు కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 2019లో నలుగురు ఎంపీలను గెలుచుకుని సంచలన విజయాలు నమోదు చేసిన బీజేపీ.. ఈసారి కూడా మరిన్ని సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. లోక్సభ సర్కిల్లో కీలక నేతలను నిలబెట్టేందుకు పార్టీ హైకమాండ్ కూడా కసరత్తు చేస్తోంది. త్వరలో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అమిత్ షా పర్యటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్ నుంచి బీజేపీ శంకుస్థాపన చేయనుందన్నారు. ఆదివారం నిర్వహించే బీజేపీ కార్యకర్తల సమావేశానికి 20 వేల మంది హాజరవుతారని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర ఉంటుందని… 20 రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటిస్తానని సంజయ్ ప్రకటించారు.
Astrology: జనవరి 27, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!