Adulterated Liquor : కల్తీ కల్లు ప్యాకెట్లలో విక్రయం.. ఎక్సైజ్ దాడులు!
- పాల ప్యాకెట్ల మాదిరి కల్తీ కల్లు ప్యాకేజింగ్
- ఎక్సైజ్ అధికారులు షాక్
- మల్కాజిగిరి, సైదాబాద్లో వరుస దాడులు
- వందల లీటర్ల కల్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Liquor : కల్తీ కల్లు కేటుగాళ్లు తెలివి మీరి పోయారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. వ్యాపారాన్ని పెంచుకునేందుకు మాంచి స్కెచ్చేశారు. ఏకంగా కల్తీ కల్లును ప్యాకెట్లలో ప్యాకేజింగ్ చేసి మరీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. చిన్న హోటళ్ల ద్వారా అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు ప్యాకెట్లు చూసి ఎక్సైజ్ పోలీసులే షాక్ అయ్యారు.
ఇక్కడ చూడండి.. ఇక్కడ మీరు చూస్తున్నవి పాల ప్యాకెట్లు అనుకుంటే పొరబడ్డట్టే… పాల ప్యాకెట్లు కాదు.. ఫినాయిల్ ప్యాకెట్లు అంతకంటే కాదు.. ఇవి కల్తీ కల్లు ప్యాకెట్లు. వును.. కల్లు ఇప్పుడు ప్యాకెట్లలో లభిస్తోంది. అది కూడా ఎక్కడో కాదు హైదరాబాద్ శివార్లలోనే లభ్యమవుతోంది..
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Hyderabad Rains : నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన
గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలోని ఓ చిన్న హోటల్లో నిత్యావసర వస్తువులు, పాల ప్యాకెట్లతోపాటు ఈ కల్లు ప్యాకెట్లు కూడా అమ్ముతున్నాడు యజమాని. ఇది ఆ నోటా ఈ నోటా ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ పోలీసులు శంకర్ అనే వ్యక్తి నడిపిస్తున్న హోటల్పై దాడి చేశారు. మంచి ప్యాకేజింగ్ చేసి.. కస్టమర్లకు అందుబాటులో ఉంచిన కల్లు ప్యాకెట్లు వారికి కనిపించాయి. వీటిని ఎక్కడి నుంచి తెచ్చావని ప్రశ్నించారు. కానీ ఆ హోటల్ యజమాని శంకర్ మాత్రం చెప్పలేదు..
హోటల్ యజమాని నుంచి ఎలాంటి ఇన్ఫో లభించకపోయినప్పటికీ.. కల్లు ప్యాకెట్ల మీద ఉన్న బ్రాండ్తో పోలీసులు కూపీ లాగారు. SVS బ్రాండ్ పేరు మీద ఈ కల్లు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఆ హోటల్ నుంచి 270 లీటర్ల కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు…
వాయిస్: ఇక వీటి అధారంగా రంగంలోకి దిగిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు.. మల్కాజిగిరి పరిధిలోని ఓ కల్లు కాంపౌండ్పై దాడి చేశారు. 20 లీటర్ల కల్తీ కల్లును నేలపాలు చేశారు. అటు మలక్ పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలోనూ అనుమతి లేకుండా కల్లు అమ్మతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 750 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. కల్లు శాంపిల్స్ తీసుకుని పల్లె బిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!