అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.
తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు.
షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు కు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన మా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములు పైన హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని మా ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. ఆదివాసీల మావ మాటే … మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు.
అడవి ప్రాంతంలో నివాసముండే ఆదివాసీలకు అవసరమైన వైద్య విద్యా సదుపాయాలు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు త్వరలోనే విద్య వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అన్నారు.
విద్య వైద్య విషయాల్లో సంతృప్త స్థాయి వరకు అందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందడం వేగవంతమైందన్నారు. అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. గతంలో ఆదివాసీలకు వైద్య సేవల విషయంలో తీవ్రమైన అలసత్వం ఉండేది… అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగ్గిందన్నారు.
Read Also డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారున్నా వదిలేది లేదు-కేసీఆర్
త్వరలోనే మరోసారి ఆదివాసీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు… మా పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన విలువైన సలహాలు సూచనలను ప్రభుత్వానికి అందజేసి ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే అత్రం సక్కు లతో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఆదివాసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!