Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Adivasi Leaders Met Minister Ktr At Pragathi Bhavan

అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి

Published Date :January 26, 2022 , 6:34 pm
By NTV WebDesk
అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.
తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు.

షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు కు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన మా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములు పైన హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని మా ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. ఆదివాసీల మావ మాటే … మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు.

అడవి ప్రాంతంలో నివాసముండే ఆదివాసీలకు అవసరమైన వైద్య విద్యా సదుపాయాలు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు త్వరలోనే విద్య వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అన్నారు.

విద్య వైద్య విషయాల్లో సంతృప్త స్థాయి వరకు అందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందడం వేగవంతమైందన్నారు. అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. గతంలో ఆదివాసీలకు వైద్య సేవల విషయంలో తీవ్రమైన అలసత్వం ఉండేది… అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగ్గిందన్నారు.

Read Also డ్ర‌గ్స్ కేసుల్లో ఎంత‌టివారున్నా వ‌దిలేది లేదు-కేసీఆర్

త్వరలోనే మరోసారి ఆదివాసీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు… మా పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన విలువైన సలహాలు సూచనలను ప్రభుత్వానికి అందజేసి ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే అత్రం సక్కు లతో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఆదివాసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adivasi leaders
  • atram sakku
  • cm kcr
  • Education
  • forest lands

తాజావార్తలు

  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్

  • Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions