Aarogyasri : ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగింపు.. సమ్మెకు దూరంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు
- ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మెతో ఆందోళన
- ప్రభుత్వ ప్రకటన: 87% ఆసుపత్రులు యథావిధిగా సేవలు
- రోజూ వందల సర్జరీలు కొనసాగుతున్నాయని సీఈవో స్పష్టం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి ఏర్పాట్లు, రోగులకు భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarogyasri : ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతాయన్న వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో 87 శాతం ఆసుపత్రులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆరోగ్యశ్రీ కింద నమోదైన 477 ఆసుపత్రులలో కేవలం 62 ఆసుపత్రులు మాత్రమే సేవలను నిలిపివేశాయి. మిగతా 415 ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
CV Anand: పహల్గామ్ బాధితుల కోసం రాజకీయ, సినీ ప్రముఖుల క్రికెట్.. HCAకు సీవీ ఆనంద్ కౌంటర్
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత రెండు వారాలుగా ఆరోగ్యశ్రీ కింద రోజుకు సగటున 844 సర్జరీలు నమోదయ్యాయని, సమ్మె పిలుపునిచ్చిన రోజున కూడా 799 సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. సేవలు నిలిపివేసిన ఆసుపత్రులకు మరోసారి విజ్ఞప్తి చేసిన సీఈవో, రోగులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేవలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ చర్యల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనతో ఆరోగ్యశ్రీపై ఆధారపడిన పేద రోగులకు పెద్ద ఉపశమనం లభించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
Tragedy : ఇది చాలా ఘోరం.. అత్త శ్రద్ధాంజలి బ్యానర్తో వస్తూ అల్లుడు మృతి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!