Aarogyasri : ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగింపు.. సమ్మెకు దూరంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు
- ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మెతో ఆందోళన
- ప్రభుత్వ ప్రకటన: 87% ఆసుపత్రులు యథావిధిగా సేవలు
- రోజూ వందల సర్జరీలు కొనసాగుతున్నాయని సీఈవో స్పష్టం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి ఏర్పాట్లు, రోగులకు భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarogyasri : ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతాయన్న వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో 87 శాతం ఆసుపత్రులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆరోగ్యశ్రీ కింద నమోదైన 477 ఆసుపత్రులలో కేవలం 62 ఆసుపత్రులు మాత్రమే సేవలను నిలిపివేశాయి. మిగతా 415 ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
CV Anand: పహల్గామ్ బాధితుల కోసం రాజకీయ, సినీ ప్రముఖుల క్రికెట్.. HCAకు సీవీ ఆనంద్ కౌంటర్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత రెండు వారాలుగా ఆరోగ్యశ్రీ కింద రోజుకు సగటున 844 సర్జరీలు నమోదయ్యాయని, సమ్మె పిలుపునిచ్చిన రోజున కూడా 799 సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. సేవలు నిలిపివేసిన ఆసుపత్రులకు మరోసారి విజ్ఞప్తి చేసిన సీఈవో, రోగులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేవలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ చర్యల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనతో ఆరోగ్యశ్రీపై ఆధారపడిన పేద రోగులకు పెద్ద ఉపశమనం లభించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
Tragedy : ఇది చాలా ఘోరం.. అత్త శ్రద్ధాంజలి బ్యానర్తో వస్తూ అల్లుడు మృతి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!