
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు ప్రజలు. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూలు ఉంటున్నాయి. క్యూలైన్లో ఎక్కువ మంది నిలబడితే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ప్రజలు తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులను క్యూలైన్లో ఉంచి దూరంగా నిలబడుతున్నారు. ఒకప్పుడు సినిమా హాళ్ల ముందు ఎక్కువ క్యూలైన్లు కనిపించేవి. ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ ముందు, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని గిరినగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం వద్ద జరిగింది.