NTV Telugu Site icon

Rangareddy Crime: కన్న బిడ్డను అమ్మింది.. సంచిలో శవమైంది

Rangareddy Crime

Rangareddy Crime

Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ముగ్గురు కలిసి ఓ మహిళను హత్య చేశారు. మహిళ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read also: Ice Cream: ఐస్‌క్రీం తింటున్నారా? బీ కేర్ ఫుల్!

మహబూబ్ నగర్ జిల్లా రాజ్ పూర్ మండలం కొర్ర తండాకు చెందిన సబావత్ రాములు, శారద అనే దంపతులు షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ రోడ్డులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి మగబిడ్డ పుట్టగానే.. ఆ చిన్నారి మానసిక పరిస్థితి బాగోకపోవడంతో.. మరో మగబిడ్డను కోరుకునేవారు. అదే సమయంలో బీహార్‌కు చెందిన దేవకి, పురుషోత్తం దంపతులు అదే కాలనీలో నివసిస్తున్నారు. రాము, శారద ఒకరికొకరు బాగా పరిచయమయ్యారు. వారితో తమ బాధలను పంచుకున్నారు. దీంతో దేవకి, పురుషోత్తం తమకు పుట్టిన మగబిడ్డను అమ్మేందుకు సిద్ధమయ్యారు. రూ.50 లక్షలకు బాలుడిని విక్రయించేందుకు పురుషోత్తం ఒప్పందం చేసుకున్నాడు. కానీ పురుషోత్తం భార్య దేవకి మాత్రం అబ్బాయిని అమ్మడం ఇష్టం లేదు. చివరకు డబ్బు అడగమని భర్త బలవంతం చేయడంతో ఆమె అంగీకరించింది. అయితే దేవకి మాత్రం తన సొంత కొడుకుని చూసేందుకు రాముడి ఇంటికి వెళ్లేది. పదే పదే ఇంటికి రావద్దని రాములు భార్య శారద, చెల్లెలు జ్యోతిలు దేవకిని హెచ్చరించారు. అయితే ఎప్పటికప్పుడు వస్తుండటంతో ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేశారు. అందులో భాగంగానే దేవకిని చంపాలని నిర్ణయించుకున్నారు.

Read also: Kamal Haasan: అందరూ కలిసిరావడం బాగుంది.. గోల్డెన్ డేస్ వచ్చినట్లే

సోమవారం రాత్రి రాములు ఇంటికి వచ్చిన దేవకి.. కొడుకును సరిగా చూసుకోవడం లేదని రాములు, శారదతో గొడవకు దిగింది. ఇదే అదునుగా భావించి దేవకిని హత్య చేశారు. మాట్లాడుకుందాం అని దేవకిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి దేవకి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం దేవకి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి తీసుకెళ్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో షాద్‌నగర్ పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా గోనె సంచిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. హత్య చేసి మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దేవకి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KTR Warangal Tour: కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్