Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచారం..
- గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అటవీశాఖ అవగాహన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అజ్జర్ వజ్జర్, చింతల్ బోరి , నిగిని చింతగూడ శివారులలో రెండు రోజులుగా పులి సంచరిస్తుందనే ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బంది కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. పులి ఎద్దుపై దాడి చేయండలో అలర్ట్ అయిన అధికారులు దీంతో గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
Read also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
పులిని బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చింతగూడ ప్రాంతంలో ఓ మహిళ గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా పులి అక్కడ కనిపించలేదు. పులి పత్తి చేల నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటికి కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టిన ఎడ్లు పులిని చూసి తాళ్లు తెంపుకుని గ్రామానికి చేరాయి. చింతగూడ గ్రామస్తులకు కొండ సమీపంలోని పత్తి వరిలో పులి పాదముద్రలు కనిపించాయి. బుధవారం దాన్ని పట్టుకునేందుకు దాదాపు 20 మంది బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మరోవైపు నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ఎకో పార్క్ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎకో పార్క్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం ఎకో పార్క్ కమాన్ వద్ద ఉన్న బొమ్మ చిరుత వద్దకు నిజమైన చిరుత వచ్చి కాసేపు నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Road Accident: రిసెప్షన్కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!