Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం..
Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం రేపింది. మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ఏముందంటే..
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఆదివాలీ ప్రజలపై కాకతీయ రాజుల అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క సారలమ్మలు రాజు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసారు. అప్పటి నుండి ఆదివాసి ప్రజలంతా సమ్మిత్కి సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. వారి పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసి సాంప్రదాయాలతో స్మరించుకుంటారు. ఆదివాసులలో ఉన్న ఈ సెంటిమెంటును ఆసరా చేసుకొని ఆదివారీలు చేసుకునే ఈ పండుగను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని ఆదివాసుల పాత్రను నాయమాత్రం చేసిందని లేఖలో పేర్కొన్నారు. మేడారం జాతరకు 4 రాష్ట్రాల నుండి కోటికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున విధులు వస్తున్నాయి. ఈ విధులను ఆదివారీ ప్రాంతంలోనే ఖర్చు చేసి అభివృద్ధి చేయవచ్చు కాని ఈ నిధులను దారి మళ్లించి స్థానిక ఆదివాసీలకు నిర్లక్ష్యం చేయడంతో వారు మరింత పేదలుగా మారిపోతున్నారు.
Read also: Mohan Bhagwat: భారత్ బలంగా లేకుంటే ప్రపంచం విధ్వంసం ఎదుర్కోవాల్సి వస్తుంది..
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టితో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి కాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం సమయం దగ్గర పడుతున్న క్రమంలో జాతర పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చింది. వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో పనులను సత్తవడన పదులను చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని తెగిపోయాయి. వాటిని ఇప్పటి వరకు నిర్మించలేదు. ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్లక్ష్యంగా రోడ్డు పోయడంతో గుంతలు అలాగే ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారు. జాతరకు వస్తున్న ప్రజలకు మౌళిక సరుపాయాలు కల్పించక పోవడం, పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పాటు జాతరకు వచ్చిన ప్రజలు అసౌకర్యాలకు గురయి వెనక్కి తిరిగిపోతున్నారని తెలిపారు. ప్రజల నుండి ఒక పక్క పన్నులు వసూలు చేస్తూ వారి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశ, విస్తృహలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యతలను వేగవంతం చేసి పూర్తి చేయాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
డిమాండ్ ఇవే..
1. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తిగా సాంప్రదాయాలతోనే చేయాలి.
2. హిందూ సాంప్రదాయాలైన లడ్డు పులిహోరి లాంటి బెల్లం ప్రసాదంగా ఇవ్వాలి.
3. జాతర అయిన వెంటనే ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలి. జబ్బుపడిన వారికి తగిన చికిత్సను అందించాలి.
4. జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిఆహారం ఇవ్వాలి. పంట పొలాల్లో బ్రాందీ దీపాలతో పాటు రకరకాల స్వర్ణ పదార్థాలన్నింటిని తీసి వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలి.
Varun Kumar: లైంగిక వేధింపులు.. భారత హాకీ ప్లేయర్పై పోక్సో కేసు నమోదు!
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!