Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం రేపింది. మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ఏముందంటే..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఆదివాలీ ప్రజలపై కాకతీయ రాజుల అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క సారలమ్మలు రాజు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసారు. అప్పటి నుండి ఆదివాసి ప్రజలంతా సమ్మిత్కి సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. వారి పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసి సాంప్రదాయాలతో స్మరించుకుంటారు. ఆదివాసులలో ఉన్న ఈ సెంటిమెంటును ఆసరా చేసుకొని ఆదివారీలు చేసుకునే ఈ పండుగను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని ఆదివాసుల పాత్రను నాయమాత్రం చేసిందని లేఖలో పేర్కొన్నారు. మేడారం జాతరకు 4 రాష్ట్రాల నుండి కోటికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ భక్తుల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున విధులు వస్తున్నాయి. ఈ విధులను ఆదివారీ ప్రాంతంలోనే ఖర్చు చేసి అభివృద్ధి చేయవచ్చు కాని ఈ నిధులను దారి మళ్లించి స్థానిక ఆదివాసీలకు నిర్లక్ష్యం చేయడంతో వారు మరింత పేదలుగా మారిపోతున్నారు.
Read also: Mohan Bhagwat: భారత్ బలంగా లేకుంటే ప్రపంచం విధ్వంసం ఎదుర్కోవాల్సి వస్తుంది..
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టితో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి కాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం సమయం దగ్గర పడుతున్న క్రమంలో జాతర పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చింది. వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో పనులను సత్తవడన పదులను చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని తెగిపోయాయి. వాటిని ఇప్పటి వరకు నిర్మించలేదు. ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్లక్ష్యంగా రోడ్డు పోయడంతో గుంతలు అలాగే ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారు. జాతరకు వస్తున్న ప్రజలకు మౌళిక సరుపాయాలు కల్పించక పోవడం, పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పాటు జాతరకు వచ్చిన ప్రజలు అసౌకర్యాలకు గురయి వెనక్కి తిరిగిపోతున్నారని తెలిపారు. ప్రజల నుండి ఒక పక్క పన్నులు వసూలు చేస్తూ వారి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశ, విస్తృహలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యతలను వేగవంతం చేసి పూర్తి చేయాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
డిమాండ్ ఇవే..
1. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తిగా సాంప్రదాయాలతోనే చేయాలి.
2. హిందూ సాంప్రదాయాలైన లడ్డు పులిహోరి లాంటి బెల్లం ప్రసాదంగా ఇవ్వాలి.
3. జాతర అయిన వెంటనే ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలి. జబ్బుపడిన వారికి తగిన చికిత్సను అందించాలి.
4. జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిఆహారం ఇవ్వాలి. పంట పొలాల్లో బ్రాందీ దీపాలతో పాటు రకరకాల స్వర్ణ పదార్థాలన్నింటిని తీసి వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలి.
Varun Kumar: లైంగిక వేధింపులు.. భారత హాకీ ప్లేయర్పై పోక్సో కేసు నమోదు!
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!