Anirudh Reddy: హత్యకేసులున్న వ్యక్తితో స్టేజ్ పంచుకోలేను.. మాణిక్కం ఠాగూర్ కు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖ రాసారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల పార్టీ లో ఎర్రశేఖర్ తీరుపై అనిరుధ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మొదటి నుంచి పార్టీ లో పని చేసుకుంటున్న తనకు ఎర్రశేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. తొమ్మిది మర్డర్ కేసులలో నిందితుడుగా ఉన్న ఎర్రశేఖర్ తో స్టేజ్ పంచుకోలేనంటూ ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. స్వంత తమ్ముడినే హత్య చేసిన ఆరోపణలున్న విషయం ప్రస్తావించారు. ఎర్రశేఖర్ చేరే సందర్భంగా ఒక మాట.. ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
అయితే.. ప్రజలు కూడా ఇదేంటి ఇప్పుడు ఎర్ర శేఖర్ను తీసుకున్నారు. దేవరకద్ర, మక్తల్లో తెదేపా వాళ్లను తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఏం అవుతుందంటున్నారు. అంతేకాదు.. నాతో ఉన్న క్యాడర్ కూడా పదే పదే అదే చెబుతుంది. తొమ్మిది మర్డర్ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్తో స్టేజ్ పంచుకోలేనని లేఖలో స్పష్టం చేశారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారనే ఆరోపణలున్నాయని, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం మిమ్మల్ని చంపరేమని ఉందని క్యాడర్ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తను ఇలాంటి వాటికి ఏం భయపడను కానీ.. నాకు ఇంతవరకు మాణిక్కం ఠాగూర్ నుంచి రిప్లై రాలేదని పేర్కొన్నారు. తన వద్దనుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
Minister Chelluboina Venu: నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. నేడు వైసీపీ నేతలపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు..!
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!